గౌహతి: క్వారంటైన్ సెంటర్లలో ఉన్న పేషంట్లు.. హెల్త్ వర్కర్లను ఇబ్బంది పెడితే వాళ్లను అరెస్టు చేస్తామని అస్సాం హెల్త్ మినిస్టర్ హిమంత బిశ్వశర్మ అన్నారు. వారిపై అటెంప్టివ్ మర్డర్ కింద నాన్బెయిలబుల్ కేసులు పెడతామన్నారు.
బొంగైగాన్, చిరాంగ్ జిల్లాల్లోని క్వారంటైన్సెంటర్లలో ఫుడ్ సరిగా లేదని ఆరోపించిన పేషంట్లుహెల్త్ వర్కర్లపై దాడి చేశారు. దీంతో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. అలానే పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తనను సంప్రదించాలని, ప్రభుత్వం వారి ఇబ్బందులను తీరుస్తుందని చెప్పారు. మనం అందరం హెల్త్ వర్కర్లకు సపోర్ట్ చేయాలని, వాళ్లంతా మన కోసం వాళ్లంతా కష్టపడి.. ముందు ఉండి ఈ మహమ్మారి నుంచి కాపాడుతున్నారని ఆయన అన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శర్మ చాలా మంది అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇస్తూ ప్రజలకు చేరువలో ఉంటారు. అస్సాంలోని రెండు మూడు క్వారంటైన్ సెంటర్లలో ఉన్న పేషంట్లు హెల్త్ వర్కర్లపై దాడి చేశారు. అంతే కాకుండా గుట్కాలు నమిలి క్వారంటైన్ సెంటర్ల గోడపై ఉమ్మారు. దీంతో వ్యాధి తొందరగా ప్రబలుతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు అస్సాం సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Post a Comment